జనసేన జనజాగృతి యాత్ర 67వ రోజు

  • కణుపూరు గ్రామ ఉపాధి హామీ రైతుకూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో గురుదత్

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 67వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలిలను ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి వెళ్లి వారి వారి గ్రామంలో ఉన్న సమస్యలు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రైతులకు చేసిన మేలుగురించి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ 400మందికి రైతుకూలీలకు గురుదత్ ప్రసాద్ మజ్జిగ పంపిణి చేసారు. ఈ కార్యక్రమం కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కరణం శ్రీను, మారిశెట్టి త్రిమూర్తులు, తర్ర నాని నందిగామ్ శేషాగిరి, బండి సౌమి, వెలిశెట్టి శ్రీను, లావేటి సుబ్రహ్మణ్యం, వేలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.