జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా తగరపు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నియమాక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన జనసేన పార్టీ అధినేతకు మరియు ఉపాధ్యక్షులు మహేందర్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.