జనం కోసం జనసేన మహాయజ్ఞం 684వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 684వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం, బావవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 685వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం, నరేంద్రపట్నం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట నియోజకవర్గం ఐటీ కో ఆర్డినేటర్ అరినే రాజేష్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, బావవరం నుండి కూరా సురేష్, కూరా గణేష్, పినపర్తి దుర్గాప్రసాద్, కూరా దుర్గారావు, పినపర్తి శ్రీను, కాకర సాయి, కూరా కృష్ణ, కాకర సత్తిబాబు, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, రాయి సతీష్, గోనేడ నుండి పల్లికల రామకృష్ణ, రేలంగి రాము, కేశవరపు వెంకట సత్యనారాయణ, సాధనాల చక్రరావు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా బొర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పోకల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు, పలివెల గిరిబాబు కుటుంబ సభ్యులకు, కాండ్రేగుల గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన వరుపుల వెంకటరాజు(శ్రీను) కుటుంబ సభ్యులకు, కర్ణాకుల మాణిక్యం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.