జనంకోసం జనసేన మహాయజ్ఞం 702వ రోజు

జగ్గంపేట, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 702వ రోజు కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆఢ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీనివాస్, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, చిట్టీడి రామారావు, గంటా దుర్గాప్రసాద్, కర్రి బాబ్జి, సబ్బు వెంకటేష్, కేశవరపు రెడ్డియ్య, నల్ల శివ, చల్లపల్లి దొరబాబు, బుర్ర అప్పన్నబాబు, సుంకర వీరబాబు, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బొడా అశోక్, సోమవరం నుండి డేగల నరేష్, తిరుమలాయపాలెం నుండి సేనాపతి రాజు, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన శివుడు పాపారావు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.