జనసేన ఆధ్వర్యంలో నరవ గ్రామంలో రక్తదాన శిబిరం

పెందుర్తి, 88వ వార్డ్ జనసేన పార్టీ ఇంచార్జ్ వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయటం ఆనవాయితిగా ఈ సంవత్సరం తాసుబల్లి ఫౌండేషన్ అధ్యక్షతన విశాఖ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, రాజకీయం అంటే ఎలక్షన్లో ప్రజలను ఓట్లు అడగడమే కాదు సమాజానికి సేవ చేయాలి అనే అధ్యక్షులు స్ఫూర్తితో నిత్యం ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క వార్డులో చేస్తూ ఉంటున్నామని ఈ యొక్క కార్యక్రమంలో యువకులతో సమానంగా మహిళలు కూడా వచ్చి రక్త దానం చేయడం హార్శించదగ్గ విషయమని కొనియాడారు, తాసుబల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శంకర్ నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ యొక్క గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు మాకు చాలా ఆనందకరంగా ఉంటుందన, ఈ యొక్క శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ముఖ్యఅతిథిగా తెలుగుదేశం సీనియర్ నాయకురాలు గంతకోరు కాళీ మాధవరావు గారు చేతుల మీదుగా దాసుపల్లి ఫౌండేషన్ భారత సేవా రత్న పుష్కార గ్రహీత వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారిని సన్మానించడం జరిగింది, జనసేన జెండాకు వందనాలు మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 94 వార్డ్ ఇంచార్జ్ పార్వతి, 95 వార్డ్ ఇంచార్జ్ కంచిపాటి మధు, జుత్తడ శ్రీను, వైకుంఠ రావు, మెండా సతీష్, స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాస్, చందక చిన్నారావు, చందక గోవింద్, హరీష్, రాడి పెంట రావు, బొడ్డు నాయుడు, గవర శ్రీను, అశోక్, బొడ్డేపల్లి గోపి, కృష్ణ, ప్రవీణ్, నవీన్ మడకశివ, గోపి, స్థానిక టిడిపి నాయకులు గవర సత్తిబాబు, ఇల్లపు శ్రీను , అల్ల శ్రీకాంత్, గవర త్రిమూర్తులు, మరియు రక్తదాతలు, ప్రజలు పాల్గొన్నారు.