రామగుండం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామగుండం, భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు రావుల మధు చేతుల మీదగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రావుల సాయికృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆర్గనైజింగ్ సెక్రటరీ మంథని శ్రవణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన సెక్రటరీ పనుకుంట్ల గోపిక్రిష్ణ, జనసేన నాయకులు వడ్డేపల్లి రాకేష్, ఎమూర్ల రంజిత్, బండారి తిరుపతి, దాసరి శశాంక్, రవికాంత్, పవన్, రాహుల్, లోకేష్, రాహుల్, టిల్లు, వర్షిత్, ఆనంద్, నందకిషోర్, వస్తావ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.