అంగన్వాడి టీచర్లు, ఆయాలకు జనసేన మద్దతు

అనకాపల్లి జిల్లా, పాయకరావు పేట, నక్కపల్లి మండలంలో గొడిచెర్ల గ్రామపంచాయతీలో అంగన్వాడి సెంటర్ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట ధర్నా చేస్తున్న సందర్భంలో అంగన్వాడి సెంటర్లకి తాళం వేసి అంగన్వాడి సెంటర్ ఉద్యోగులు బందులో పాల్గొంటున్న సందర్భంలో పంచాయతీ అధికారులు సెక్రటరి, విఆర్వో, విలేజ్ పోలీస్ గ్రామ వాలంటీర్లు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టే తరుణంలో గొడిచెర్ల జనసేన నాయకులు నల్లల రత్నాజి, టీడీపి నాయకులు దొరబాబు జనసైనికులు చరణ్, ఉప్పాటి అరుణ్, సాయి, చరణ్ తదితరులు అక్కడికి చేరుకొని ఆపడం జరిగినది. పరిపాలన ప్రభుత్వమైన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బందులో పాల్గొంటున్న అంగన్వాడి టీచర్లు, ఆయాలకు జనసేన మద్దతు ఉంటుంది అని తెలియజేశారు.