ప్రెస్ క్లబ్ భవన్ లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, అమలాపురం పట్టణంలోని అమలాపురం ప్రెస్ క్లబ్ భవన్ లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంబాల నాగ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ వి. ప్రసాద్ (బాబీ) జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ము వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడలి రాజు, ఉపాధ్యక్షులు ఆకుల రవితేజ, సమ యమంతుల హరి, కోశాధికారి మాకే శ్రీను, సంయుక్త కార్యదర్శి పొట్టు పోతు నాగు, సీనియర్ పాత్రికేయులు ఆచంటవెంకట్, గారపాటి పండుబాబు, నిమ్మకాయల సతీష్, అరిగెలరుద్ర శ్రీను, కాకిలేటి సూరిబాబు, పి. వెంకటేశ్వరావు, చొల్లంగి శేఖర్, బషీర్, అబ్బాస్, వెంకటేష్, పిండి శేషు, జి.స్వామి, ఆర్. కృష్ణ, పి. నాయుడు, జి. సాయి ప్రసాద్, కె. సాయి, సి హెచ్. నాని, పాత్రి కేయులు పాల్గొన్నారు.