పోరాటం ఫలితాన్ని ఇస్తుంది

ముధోల్, గత కొన్ని సంవత్సరాలుగా వికలాంగుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేయడం వల్లే నేడు నియోజకవర్గంలోని భైంసా ఏరియా ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించారు. వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు, జనసేన పార్టీ నాయకుల అండదండలతో కలెక్టర్ ఆఫీస్, డిఅర్.డి.ఏ, మరియు వైద్య ఆరోగ్య శాఖలకు వికలాంగుల సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సదరం క్యాంపులో కేవలం అతి తక్కువ మందికి మాత్రమే చూస్తున్నారు. కాని కనీసం 200 మంది వికలాంగులకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా అన్ని రకాల డిసబుల్టిలకు పరీక్షలు నిర్వహించి డాక్టర్లను కేటాయించాలి. అప్పుడు నియోజక వర్గంలో వికలాంగులందరికి న్యాయం జరుగుతుంది. ఇంక భవిష్యత్తులో వికలాంగుల పెన్షన్ పెంపు కోసం, ఉచిత బస్ సౌకర్యం, 35 కేజీల బియ్యం, చట్ట సభల్లో రిజర్వేషన్, వివక్ష తదితర డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతున్నాం.