గోపాలపురం జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం జనసేన పార్టీ నాయకులు దొడ్డి గర్ల సువర్ణ రాజు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికుల సమక్షంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోపాలపురం మండలం, గోపాలపురం గ్రామంలో నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సువర్ణ రాజు మాట్లాడుతూ 77 సంవత్సరాలుగా దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినా నిజమైన స్వాతంత్య్రం రాలేదని, పాలకుల చేతిలో మన దేశ చట్టాలు బలవంతులకు బలహీనంగా, బలహీనులు బలవంతంగా పని చేస్తున్నాయి, పట్ట పగలే మహిళలు రోడ్డు పైన నడవాలంటే అభద్రతా భావం ఉందని, ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తూ అరాచక పాలనను కొనసాగిస్తున్నారు. రాజ్యంగ విలువలను తుంగలో తొక్కి రాక్షస పాలనను చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా నిజమైన స్వాతంత్య్రం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి గంగరాజు, గోపాలపురం గ్రామ అధ్యక్షులు వడ్డీ రామ్ లీలా, గణపతి, సూర్య భగవాన్, సత్యనారాయణ, నాగేంద్ర, దేవరపల్లి మండల అధ్యక్షులు కాట్నం గణేష్, నల్లజర్ల మండల అధ్యక్షులు చోడసాని బాపిరాజు, పిల్లి కాంతారావు, వీర మహిళలు సీత, సౌజన్య, శాంతి మరియు జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.