యు.పి.రాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాజాం నియోజకవర్గం: రాజాం జనసేన కార్యాలయంలో పార్టీ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో మంగళవారం జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజాం మండలం బుచ్చింపేట గ్రామంలో జనసేన పార్టీ పట్టణ నాయకులు నమ్మి దుర్గారావు సమక్షంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ.. మనం అందరం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే మన దేశం కోసం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగలా ప్రతిఫలం అని అందుకే మన అందరం వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, మనం కూడా వారి త్యాగాలు వృధా కాకుండా మన దేశం కోసం మనవంతు కృషి చేస్తూ ఆ మహనీయులు కన్న కలలను తీర్చిదిద్దేలా మనం ముందుకు వెళ్లాలని తెలియచేశారు.