విచారణ వేగవంతం చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి: జనసేన వినతి పత్రం

విజయవాడ: విశాఖపట్నం నోవోటెల్ హోటల్ లో 15.10.2022 తేదీన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వినిని, మరికొందరు వీరమహిళలను నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పూట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో 01.11.2022 తేదీన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై విచారణ జరిపి రిపోర్ట్ పంపవలసిందిగా 28.11.2022 తేదీన మహిళా కమిషన్ డీజీపీకి లెటర్ వ్రాయడం జరిగింది. షుమారు 6 నెలలు గడచినా డీజీపీ నుండి గానీ, మహిళా కమిషన్ నుండి గానీ ఎటువంటి స్పందనా లేదు. కాబట్టి మంగళవారం విజయవాడలో మరికొందరు స్థానిక వీరమహిళలు శ్రీమతి సౌజన్య, వీరమహిళ రీజినల్ కోఆర్డినేటర్, శ్రీమతి రావి రమ, జిల్లా కార్యదర్శితో కలిసి ఏపీ మహిళా కమిషన్ లో విచారణ వేగవంతం చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా లెటర్ ఇవ్వటం జరిగింది.