మల్లవరం గ్రామంలో జనం కోసం జనసేన 531వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 531వ రోజు కర్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 84460 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 532వ రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కోరారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబుకి, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జి.వి నాయుడు), గ్రామ ఉపాధ్యక్షులు గోళ్ళ విజయ్ గారికి, గ్రామ ఉపాధ్యక్షులు కర్ణం బుజ్జి, గ్రామ ప్రధాన కార్యదర్శి యలంశెట్టి వేణు, గ్రామ సంయుక్త కార్యదర్శి బొందల ఆంజనేయులు, పల్లెల ప్రసాద్(చిరు), వట్టికూటి జనార్ధన్, చింతపల్లి మౌళి, గుమ్మాల సురేష్, ఇంజరపు సాయి, కర్ణం ఆనంద్, సిగిరెడ్డి వీరబాబు, బోయిన ప్రసాద్, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రామకృష్ణాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన డేగల విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు, సలిగోలు కళ్యాణ్ కుటుంబ సభ్యులకు, మల్లవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన యలంశెట్టి వేణు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక పాటంశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.