రామచంద్రపురం గ్రామంలో జనం కోసం జనసేన 539వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 539వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, గొల్లలగుంట పంచాయతీ, రామచంద్రపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 87510 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 540వ రోజు కార్యక్రమం గురువారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జగ్గంపేట మండలం కృష్ణాపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి ఇసరపు శివ, రామచంద్రపురం నుండి గంజా శ్రీనివాస్, కానాటి వెంకన్న, గొల్లలగుంట నుండి గొంప దుర్గాప్రసాద్, గొల్లవిల్లి దుర్గయ్య, యలమంచిలి వీరబాబు, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు పాటంశెట్టి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.