శ్రీ శంభులింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో శ్రీశ్రీశ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ ఆహ్వానం మేరకు గ్రామస్తుల మరియు జనసైనికుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజ నిర్వహించి బొర్రా వెంకట అప్పారావు ను ఆశీర్వదించడం జరిగినది. అనంతరం ఆలయ అభివృద్ధికి 50,002 రూపాయలు విరాళంగా గుడి ధర్మకర్త సిరిగిరి వెంకట్రావు మరియు సిరిగిరి పవన్ కుమార్ కి చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, నగరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వర, ఏడో వార్డు కౌన్సిలర్ సుమన్, మైనార్టీ నాయకులు జాన్ ఫిరా, చిలకా సత్యం, జనసేన పార్టీ నాయకులు, గ్రామ జనసైనికులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.