డీకే పట్నం పంచాయతీలో జనసేన గ్రామ బాట
పార్వతీపురం: డీకే పట్నం గ్రామ పంచాయతీలో ఆదివారం పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని ఆధ్వర్యంలో జనసేన గ్రామబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకుడు అక్కివరపు మోహన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, జనసేన యువనాయకులు, జనసైనికులు మరియు పంచాయతీ యువత పాల్గొన్నారు. ఈ జనసేన గ్రామ బాటలో భాగంగా పంచాయితీలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలు మనకు చెప్పే సమస్యలు ముఖ్యంగా రోడ్డు సమస్యలు, తాగునీరు సమస్య, రేషన్ కార్డ్ సమస్యలు, అధికంగా ఉన్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పన గూర్చి అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ప్రజలు సహకరిస్తే, సమస్యలు పరిష్కారించే వరకూ ఉపక్రమించేది లేదని పెర్కోన్నారు. అభివృద్ధికి నోచుకోని గ్రామాలైన డీకే పట్నం, బొడ్డవలస, టోంకి గ్రామాల, సమస్యలను పూర్తి చేయకపోతే, వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఈ గ్రామ బాట కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, జిల్లా నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేశ్వరరావు, కర్రీ మణికంఠ, అల్లు రమేష్, సతీష్, పైల రాజు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, పాత్ర పవన్, అక్కేన భాస్కరరావు, అంబటి బలరాం, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, సింగిడి సంతోష్, దుర్గా, కనకరాజు, పాత్ర ప్రదీప్, కృప రావు కేశవరావు, మహేష్, శివ సాయి జనసేన కార్యకర్తలు పాల్గొని రానున్న రోజుల్లో మన పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం జనసైనికులకి, బొబ్బిలి నియోజకవర్గం జనసైనికులకి, మరియు బలిజిపేట, సీతానగరం మండల జనసైనికులకి పేరు పేరునా పార్వతీపురం మండల జనసేన తరుపున ముఖ్యంగా డీకే పట్నం, గ్రామపంచాయతీ గోచక్క, పంచాయతీ జనసైనికులు, డోకిశీల పంచాయతీ జనసైనికులు అందరికీ ధన్యవాదములు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-17-at-1.30.14-PM-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-17-at-1.30.15-PM-1024x766.jpeg)