డ్వాక్రా మహిళలను బలవంతంగా మంత్రుల మీటింగులకు తరలిస్తున్నారు

మదనపల్లె, జనంతో కిక్కిరిసిపోతున్న మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చేసిన సామాజిక న్యాయం వల్లే ఇంత గొప్ప స్పందన వస్తుందని మంత్రులు చెప్తున్నారు. తీరా సభల్లో అంతంత మాత్రం జనం ఉంటున్నారు. వాళ్ళు కూడా డ్వాక్రా మహిళలు. విజయవాడ పరిసర ప్రాంతాలకు రాబోతున్న మంత్రుల బస్సు యాత్రకు సంబంధించి డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ తీసుకుని వస్తున్నారు. మీటింగ్ లకు రాకపోతే పథకాలు కట్ చేస్తాం అని ఎంత నిస్సిగ్గుగా బెదిరిస్తున్నారు. మీరు అభివృద్ది కార్యక్రమాలు చేస్తే ప్రజలే స్వచ్చందంగా తరలి వస్తారు అంతేగానీ ఇలా బెదిరించి మహిళలను సమావేశాలకు రప్పించడం శోచనీయం. జనాలు రారు అని మీకే అనుమానాలున్నాయి అంటే మీరు ఏ పాటి అభివృద్ది చేశారో మీరీపాటికి గ్రహించి ఉంటారు. బలవంతంగా బెదిరించి డ్వాక్రా మహిళలను మంత్రుల సభలకు తీసుకురావడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.