రియల్ ఎస్టేట్ లో దురాక్రమణ జరగలేదని నిరూపించగలరా..?
- ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పత్రికా ముఖంగా ప్రశ్నించిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్
నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.. పొట్టేళ్ల వాగు వద్ద మీ పేరుపై ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్లో దురాక్రమణ జరగలేదని నిరూపించగలరా..? అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ప్రెస్ నోట్ ఇచ్చారు.. సర్వేపల్లి నియోజకవర్గం, శ్రామిక నగర్, పొట్టేళ్ళ వాగు దగ్గర కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన లేఔట్ లో మూడు ఎకరాలు దురాక్రమణ జరిగింది. ఆరు ఎకరాల లేఔట్ లో మూడు ఎకరాల భూమి రికార్డులో ఉండగా మూడు ఎకరాలు పొట్టేళ్ల వాగు అయితే ఏమి అసైన్డ్ భూమి ని ఆక్రమించి లేవుట్ వేయడం జరిగింది. ఎన్నో ఎకరాల పంట పొలానికి నీరందిస్తున్న ఈ వాగు దురాక్రమణ హేయమైన చర్య. ▫️సామాన్య మానవుడు కష్టపడి సంపాదించుకొని అత్యవసరాలను కూడా వాయిదా వేసుకుంటున్న తరుణంలో.. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రజా సంపదను, సహజ వనరులను దోచుకుని తింటూనే ఉన్నారు. గుర్తించిన ఈ ఒక్క లే అవుట్లోనే ఆరెకరాలలో మూడు ఎకరాలు దురాక్రమణ ఉంటే ఈ నాలుగేళ్లలో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరూ గుర్తెరిగి స్థానిక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పగలరు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-8.34.24-PM-1-1024x771.jpeg)