హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయండి: జనసేన డిమాండ్

అవనిగడ్డ నియోజకవర్గం: సున్నా వడ్డీ పథకం 4వ విడత జిల్లా స్థాయి కార్యక్రమంను ప్రారంభించడానికి అవనిగడ్డకు వచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన అభ్యుదయ శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాకు హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మరియు ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన రెడ్డిని అవనిగడ్డ నియోజక వర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయించడానికి ప్రయత్నం చేయాలని, అవనిగడ్డ నుండి కోడూరు రోడ్డు పూర్తిగా పాడుయిపోయిన కారణంగా గత 7 ఏళ్ళ నుండి ఈ రోడ్డుపై ప్రయాణం చెయ్యాలి అంటే ప్రజలు భయపడుతున్నారని త్వరలో ఈరోడ్డు బాగుచేయించాలని జనసేన తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు అళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు పాల్గొన్నారు.