దళిత నాయకుడు సురేష్ కు కుంటిమద్ది పరామర్శ.. అండగా ఉంటామని భరోసా..

అనంతపురం: పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణం నందు ఎంఆర్ ఓ ఆఫీసుకు ఆనుకొని సర్వేనెంబర్ 271/ 2, 271/4 లెటర్ నందు 7 ఎకరాల పైచిలుకు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అనుచరులు అక్రమంగా అన్యాక్రాంతం చేస్తుంటే పెనుగొండ నియోజకవర్గం జనసేన నాయకులు సురేష్, వెంకటేష్, సంతోష్, అనిల్ మరియు తదితర నాయకులు నిరుపేదలకు చెందవలసిన ప్రభుత్వ భూమిని పరిరక్షించి వైసీపీ నాయకులను నిలదీసినందుకు. వైసీపీ నాయకులు పోలీస్ ఉన్నతాధికారుల పైన ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడితో ఆగకుండా వైసీపీ గూండా నాయకులు అంబేద్కర్ సర్కిల్లో దళిత నాయకుడైన సురేష్ తన కుమారుడిని దారుణంగా అమానుషంగా కులం పేరుతో దూషించి దాడి చేశారు. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, సురేష్ ఇంటికి వెళ్లి సురేష్ ను వారి కుమారుడిని పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకొని నేను, జనసేన పార్టీ మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. దాడి జరిగిన సంఘటనా స్థలాన్ని, అన్యాక్రాంతానికి గురవుతున్న స్థలంలో పర్యటించి, గోరంట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసుల పూర్వా ఫలాలు, పురోగతిని తెలుసుకొని పెనుగొండ నియోజకవర్గ నాయకులకు మీకు అన్నివేళలా జనసేన పార్టీ మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని మనోస్థైర్యాన్ని కల్పించి, అన్నివేళలా మీకు నేను అండదండగా ఉంటానని లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి భరోసా ఇచ్చారు. జనసేన నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు చేస్తే వారు ఎంతటి నాయకులైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.