గ్రామ గ్రామాన యువశక్తి ప్రచారం

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, జనసేన నాయకులు కరిమజ్జి.మల్లీశ్వరరావు అధ్వర్యంలో పాతర్ల పిల్లి, దేరసాం, వరిస్సాం, మెంటాడ, మరువాడ, పోతయ్యపేట, పైడిభీమవరం, చిల్లపేటరాజాం, పున్ననపాలేం, సంచ్చాం, వేల్పు రాయి, కమ్మశిగడాం, కాకిపాలేం, దేవరాపల్లి, బంటు పిల్లి, గోల్లపాలేం, ముక్తుంపురం, కోండమెలగాం గ్రామాలలో సోమవారం ఉదయం నుండి యువశక్తి ప్రచారం శరవేగంగా, విసృతంగా మొదలు పెట్టారు. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం, ప్రతివాడ, ప్రతి వీధి, ప్రతి పల్లెల్లోనూ ప్రచారం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. మన యువతే మన భవిత గురించి బహిరంగ సభ గురించి ప్రజలకు వివరించడం జరిగింది. 12తేదిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో నిర్వహించబోయే బహిరంగ సభకు ప్రజలు యువకులు యువతీ బారి యెత్తున ఈ కార్యక్రమంలో పాల్గోంటారని, సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని జనసేన నాయకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు కెల్లా.రాము, శనపతి.సూరినాయుడు ఎచ్చెర్ల.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.