శేరిలింగంపల్లి జనసేన పార్టీ కమిటీ నియామకం
తెలంగాణ రాష్ట్రం, జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీ నియామకం సోమవారం జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ డా.మాధవరెడ్డి నియమించడం జరిగింది. జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీలో సోషల్ మీడీయా కో-ఆర్డినేటరుగా గార శ్రవణ్ కుమార్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా నియమించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డ.మాధవరెడ్డి లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని మరియు నా మీద ఉంచిన నమ్మకంతో రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ఇతర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-12-at-21.53.26-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-12-at-21.47.19.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-12-at-21.30.26-724x1024.jpeg)