కొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

పాడేరు: ఏ.ఎస్.ఆర్ జిల్లా జి.కే వీది మండలం, కొత్తపాలెం గ్రామంలో గ్రామస్థుల పిలుపుమేరకు పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ అడ్వైసర్ కిల్లో రాజన్ మరియు నియోజకవర్గ నాయకులు ఉల్లి సీతారాం హాజరైనారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ వైసీపీ చేసిన మోసానికి ప్రతికారంగానే ఈరోజు జనసేన పార్టీ లోకి చేరుతున్నామని, పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు అశాయాలు మకు బాగా నచ్చాయని అందుకే నాయకులను పిలుచుకొని పార్టీలో చేరామని చెప్పారు. కిల్లో రాజన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. రాజన్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ ఆదివాసి హక్కులను చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసి గిరిజన ప్రజలకు తీవ్రమైన ద్రోహంచేసిందని. అందుకే వైసీపీ పార్టీ నీ ఆదివాసి ప్రంతనుండి, నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. మన హక్కులు మనకు దక్కాలంటే జనసేన తోనే సాధ్యమని చెప్పారు. మీరందరూ గ్లసుకుర్తుకి ఓటేసి వైసీపీ నీ అంతం చేయాలని పిలుపునిచ్చారు. చింతపల్లి మండల నాయకులు కూడా అబ్బైదొర, సాయిరాం, సాయి, జి కె వీది మండల నాయకులు రఘు వంశి, ఎస్వరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.