రధాల పేటకు చెందిన దళిత కుటుంబానికి అండగా జనసేన

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణం 16వ వార్డు రధాల పేటకు చెందిన దళిత సోదరుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు వారి కుటుంబ సభ్యులు 6 గురు పిల్లలతో తీవ్ర ఇబ్బంది పడుతూ తినడానికి కూడా కష్టంగా ఉందని రధాల పేటకు చెందిన జనసైనికుడు డా.కే ప్రసాద్, పి.ఎస్.ఎన్. మూర్తి దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తెంగళ్ళ ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు వెంటనే మూర్తి బియ్యం బస్తా కూరగాయలు మంగళవారం వారి కుటుంబానికి ఇవ్వటం జరిగింది. వారి ఆర్ధిక స్థితిపై ఆరా తీయగా కరెంట్ బిల్లు కట్టలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నామని తెలియజేశారు. అంతేకాకుండా ఈరోజు పూర్తిగా కరెంటు తొలగించడం అయింది అని చెప్పియున్నారు. వెంటనే ఎలక్ట్రికల్ ఏ.ఈ కి ఫోన్ చేసి సమస్య ఏంటని అడిగి తెలుసుకుని వాళ్ళ బిల్లు ఎంత అయితే ఉందో అంతా చెప్పండి నేను కడతానని చెప్పడం జరిగింది. వాళ్లు ఉండటానికి కూడా చిన్న పందిరిలా ఉంది వర్షం వస్తే ఆ పిల్లలతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. దీన్ని మన జనసేన పెద్దల దృష్టికి తీసుకెళ్లి తగు సాయం అందిస్తామని వాళ్లకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, కోలా దుర్గ, కసిరెడ్డి నాగేశ్వరావు, కర్రి కాశీ, పెంకే జగదీష్, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై. శ్రీనివాస్, తోట సతీష్ , వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, చర్ల గీత, దేశిరెడ్డి సతీష్, పిట్టా చిన్న, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, డాకే ప్రసాద్. పి. కుమార్, కె ప్రశాంత్, డి నవీన్, పి రాజు, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.