వావిలాల ఘాట్ నిర్వాసితులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది: బొర్రా

సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల ఘాట్ సమీపంలో ఉంటున్న 150 కుటుంబాలు 6వ వార్డులో కనీస సౌకర్యాలు లేకుండా ఉంటున్న విషయం విధితమే. అయితే నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం. ప్రభుత్వం కనీసం మట్టి రోడ్డును(గ్రావెల్ రోడ్డు) అయినా వారం రోజుల్లో వేయించాలని స్థానిక ప్రభుత్వనికి అల్టిమేటం జారీ చేసినా స్పందన లేకపోవడంతో ముళ్ళ పొదలను, జమ్మి చెట్లను క్రేన్ తో తొలగింపజేసి, నేడు గ్రావెల్ తోలించి గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన బొర్రా. 6వ వార్డు కాలనీవాసులకు ఇచ్చిన మాట ప్రకారం. గ్రావెల్ రోడ్డు నిర్మాణం నిమిత్తం గ్రావెల్ తోలించి కాలనీ వాసులు ఈ రోడ్డు మార్గంలో తిరిగే విధంగా దగ్గరుండి గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తున్న జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు. మీకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కాలనీ వాసులకు అభయం ఇచ్చారు బొర్రా. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమిశెట్టి సాంబశివరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు భత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నాయకులు చిలక పూర్ణ, చిలక సత్యం, తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.