చివరకు నిరాహార దీక్షలకు భయపడే పరిస్థితికి వచ్చిన వైసీపీ

  • సర్వేపల్లి వైసీపీ నాయకుల తీరును చూస్తుంటే హాస్యస్పదంగా ఉంది

సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లిగూడూరు మండలంలో నరకూరు సెంటర్ నందు రైతులకు సాగునీరు ఇవ్వాలని రైతులకు మద్దతుగా వారికి అండగా జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒక్కరోజుపాటు శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తమ సొంత స్థలంలో చేపట్టగా వైసీపీ నాయకులు కుట్రపూరితంగా పోలీసులను అడ్డుపెట్టుకొని నిరాహార దీక్షను చెయ్యనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ రైతులకు అండగా నిలవాల్సిన అధికార వైసీపీ నాయకులు, అండగా నిలవకపోగా రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ రైతులకు మద్దతుగా చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి అనుమతి లేదంటూ అడ్డుకోవడం సిగ్గుచేటు, పోలీసులు రైతుల పక్షాన నిలబడడం పోయి వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం దారుణం. ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకుంటే మంచిది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి స్థాపించే ప్రజా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గుడి హరిరెడ్డి, టీడీపీ ఎంపీటీసీ సభ్యులు రఘు బాబు, టిడిపి మండల ఉపాధ్యక్షులు పాకం వెంకయ్య, తోటపల్లిగూడూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సందీప్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శరత్, రవి, నవీన్, హుస్సేన్ భాష, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.