అగ్ని ప్రమాద భాదితులకు అండగా జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలం, లంకలపల్లి పాలేం గ్రామ పంచాయతీలో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన ఇనపకుర్తి సత్యనారాయణ మరియు వెల్దూటి కనకరాజు కుటుంబాలను శుక్రవారం ఉదయం పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించి, వారికి ప్రభుత్వం నుంచి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీ జనసైనికులు నరేష్, నరేంద్ర, యోగి, అనంత్ ఆధ్వర్యంలో మండల జనసేన కార్యవర్గం తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, రాష్ట్ర మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, వీరమహిళ బాసి దుర్గ, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, భలభద్రుని జానకీరామ్, కిలారి రామునాయుడు, మాదేటి ఈశ్వర్రావు, దుక్క అప్పలరాజు, పిన్నింటి అప్పలనాయుడు, బర్రి తాతారావు, సిధ్దు, బూర సతీష్, అల్లాడ రాము, జగదీష్, గుడివాడ జమరాజు, స్మార్ట్ రమేష్, లెంక సురేష్, పసుపులేటి మహేష్, సురేష్ పసుపులేటి, శ్రీను పసుపులేటి, చందు పసుపులేటి, భరత్, వెంకటేష్, జానకి, పవన్, సోని, బొట్ట హరీష్, బోట్ట నవీన్, బొట్ట సాయి, లంకలపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.