అయ్యప్ప స్వామి ఆవరణలో భిక్ష ఏర్పాటు చేసిన రెడ్డి అప్పల నాయుడు దంపతులు

ఏలూరు నియోజకవర్గంలోని, మార్కండేయ స్వామి వారి దేవాలయం హరిహరసుతుడు శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి ఆవరణలో ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమంలో బుధవారం వడి మరియు భిక్షా ప్రదాతలుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు దంపతులు వ్యవహరించడం జరిగింది. ఈ భిక్ష కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భవానీ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొని భిక్షను స్వీకరించడం జరిగింది.