పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట, జిల్లాల పర్యటనలో భాగంగా రాజంపేట నియోజకవర్గం విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని గురువారం తోట కళ్యాణమండపం వద్ద డిఆర్డిఏ మాజీ రాష్ట్ర అధికారి, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి చిత్రపటాన్ని బహుకరించారు. భ్రష్టు పట్టిన నేటి రాజకీయ వ్యవస్థలో యల్లటూరు వంటి విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం అవసరమని పురందేశ్వరి సూచించారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు శ్రీనివాసరాజు పురందేశ్వరి ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, నాగోతు రమేష్ నాయుడు, జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, ఆకుల చలపతి, బాబు, నాసర్ ఖాన్, మౌల, పత్తి నారాయణ, చిట్టె బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.