గోరంట్లలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ

గోరంట్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్లు గోరంట్లలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీ చేపట్టని విధంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగోగుల కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తెచ్చాడు. కార్యకర్తల క్షేమం కోసం ఇంతలా ఆలోచించే నాయకుడు చరిత్రలో నిలిచిపోతారని, రానున్న 2024 ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేన – టిడిపి అధికారం చేపట్టబోతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, మండల నాయకులు నరేష్, నాగేష్, రాఘవేంద్ర, బాబావలి, శ్రీనివాసులు, వసీం, ఆంజనేయులు, శ్రీరాములు, రాజేంద్ర, శ్రీకాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.