ముత్తుకూరు మండల జనసేన సమన్వయ కమిటీ నియామకం

సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సమన్వయ కమిటీ నియామకం జరిగింది. జనసేన పార్టీ సమన్వయ కమిటీ ముత్తుకూరు మండల అధ్యక్షుడిగా షేక్ రహీం, ఉపాధ్యక్షుడిగా బోల అశోక్, ప్రధాన కార్యదర్శిగా రాగల వెంకటేష్, కావలి పవన్, కోశాధికారిగా కావలి మస్తాన్, పలాల్ల శ్రీను అధికార ప్రతినిధి పట్టపు నవీన్, కార్యదర్శి దగ్గోలు సుమన్, కమిటీ సభ్యులు మరొ 20 మందితో కలిపి కమిటీని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ యొక్క కమిటీ ముఖ్య లక్ష్యం రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా జనసేన పార్టీ బలం జనసేన సత్త ఏంటి అనేది చూపించబోతున్నాం ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని యువతని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగులో కూడా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఆయన నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఈ కమిటీ పని చేస్తుంది. ఎన్నికల తరుణంలో ఎంతోమంది నాయకులు పుట్టుకొస్తారు ఎన్నికల అనంతరం అదృశ్యం అయిపోతారు అటువంటివి జనసేన పార్టీ పరిగణలోకి తీసుకోబడదు ఎవరైతే నీతి నిజాయితీగా జనసేన జెండా పట్టుకొని కష్టకాలంలో కూడా జనసేన పార్టీ కోసం పోరాటం చేస్తారు వాళ్లకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటది. వాళ్ళ కుటుంబాలని కంటికి రెప్పలా కాపాడుతుంది రేపు రాబోయే ప్రజా ప్రభుత్వంలో జనసేన సత్తా ఎలా ఉంటాది సర్వేపల్లి నియోజకవర్గం లో మన బలాన్ని చూపించబోతున్నాం కాబట్టి కమిటీ సభ్యులందరికీ కూడా సాధారంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఉదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో మనందరం కూడా కలిసికట్టుగా ముత్తుకూరు మండలంలోని 22 పంచాయతీలో కూడా గ్రామ కమిటీలు వేసి పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకు వెళ్దాం వెళ్తారని మీ మీద నమ్మకంతో ఈ యొక్క కమిటీని నియమించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో యువశక్తి యువత రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు ఇంత అభివృద్ధి చెందాయా అనేటువంటి విషయాన్ని మనం చూపించబోతున్నామని అన్నారు.