6వ రోజుకు చేరిన పాటంశెట్టి ఆమరణ నిరాహారదీక్ష

జగ్గంపేట, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం ఆయకట్టులో ఉన్న 32 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయి రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగిన ఈ నష్టానికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని గత 6 రోజుల నుండి జగ్గంపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి నీటిని విడుదల చేసి రైతూలను ఆదుకోవాలని ఒక వినతిపత్రం రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.