ఎకరాకు 20 వేల రూపాయలు తక్షణ సాయం వెంటనే అందించాలి: కామిశెట్టి రమేష్

గురజాల, మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు తక్షణ సాయం వెంటనే అందించాలని జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ డిమాండ్ చేసారు. మిరప పంటకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పల్నాడు. ఆరుగాలం శ్రమించి, పండించిన పంట తుఫాన్ ప్రభావం వలన, తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా వేసి, తక్షణ సాయం కింద రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు తక్షణ సాయం ఇవ్వాలని, డిమాండ్ చేశారు. రైతే రాజు అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు, ఇప్పటికైనా పంట నష్టం అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.