పొన్నలూరు మండలం ప్రజలందరి తరపున ఎస్ఐ కి “ఉగాది” శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

*చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తే ఎవరిని వదిలిపెట్టను అంటున్న ఎస్ఐ “రమేష్ బాబు” .
*యువకులు సమాజానికి ఉపయోగపడాలి అంటున్న ఎస్సై “రమేష్ బాబు”
*నిజాయితీ గల ఎస్ఐ మన మండలంలో ఉండటం మన ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అంటున్న “మనోజ్ కుమార్”.
*”ఉగాది” సందర్భంగా జనసేన పార్టీ జనసైనికులు అందరూ ఎస్సై “రమేష్ బాబు” గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పొన్నలూరు మండలంలో చట్టానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసిన వదిలిపెట్టేది లేదు, అన్యాయాలు చేసిన, అక్రమాలకు పాల్పడిన, దొంగతనాలు జరిగినా, అల్లర్లు సృష్టించిన, గొడవలు జరిగిన, పేకాట ఆడినా, కోడిపందాలు వేసినా, అక్రమంగా ఇసుక తరలింపు చేసినా, గుట్కాలు అమ్మినా, ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటున్న ఎస్సై రమేష్ బాబు. నీతి, నిజాయితీ, ధైర్యం, మంచితనం, మానవత్వం, ఫ్రెండ్లీగా ఉండటం, అదేవిధంగా స్ట్రిక్ట్ గా కూడా ఉండటం, అన్యాయానికి తావులేకుండా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం గా భావిస్తూ, ప్రజల సమస్యల యొక్క పరిష్కార మార్గాలకు నిరంతరం కృషి చేస్తున్నా ఎస్సై రమేష్ బాబు పొన్నలూరు మండలానికి రావడం మండల ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అని మనోజ్ కుమార్ కొనియాడారు. ఎస్ఐ ని కలిసినవారిలో తిరుమల్ రెడ్డి, షేక్ ఖాజావలి, సుబ్రహ్మణ్యం నాయుడు, సాయి, శ్రీను, ఖాజావలి, వెంకట్ రెడ్డి, గోపి, గఫూర్ మొదలైన జనసేన పార్టీ జనసైనికులు పాల్గొన్నారు.