Singanamala: వర్షాలకు నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలి

శింగనమల నియోజకవర్గం, జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ TC.వరుణ్ ఆదేశాల మేరకు సోమవారం అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో బుక్కరాయసముద్రం మండలం గోవిందపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి గ్రామంలో కుండపోత వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. కొన్ని వేల ఎకరాలలో వరిపోలంలోకి వర్షపు నీరు రావటంతో తీవ్ర పంట నష్టంతో లబోదిబోమంటున్న రైతులని పరామర్శించడం జరిగింది. మొద్దు నిద్ర పోతున్న ఈ ప్రభుత్వం రైతులకు తక్షణ సహాయం కింద 30,000/- రూపాయలు జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, సంజీవరాయుడు సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ, రాగే శివ, ఎర్రిస్వామి, పెద్దిరాజు, కిషోర్, దేవరకొండ హరీష్ పాల్గొన్నారు.