రాజాం రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ వినూత్న నిరసన

రాజాం: జనసేన పార్టీ సమన్వయకర్త ఎన్ని రాజు ఆధ్వర్యంలో పాలకొండ రోడ్ మీద ఉన్న దుమ్ము, ధూళి నుండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు మాస్క్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ..”ఒకప్పుడు కరోనా నుండి రక్షణ కోసం మాస్క్ ఉపయోగించే వాళ్ళం, నేడు రోడ్ల నుండి వస్తున్న దుమ్ము, ధూళి నుండి మాస్క్ వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఏ స్థాయిలో ఈ రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని, అలాగే అధికారులు కానీ, ప్రభుత్వం కానీ తాత్కాలిక మర్మత్తులు కూడా చేపట్టడంలేదు. కనీస మౌలిక వసతులు కల్పించలేని స్థితిలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కావున త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణ పనులు పునః ప్రారంభించాలని” ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రేగిడి మండల అధ్యక్షులు ఎస్. అప్పలనాయుడు మరియు జనసైనికులు పాల్గొన్నారు.