నాదెండ్ల మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో బుధవారం నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం అగ్రహారం సతీష్ ఆధ్వర్యంలో కరణం గారి సెంటర్లోను జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈ వై.సి.పి ప్రభుత్వం లాండ్, సాండ్, వైను, మైను ఇలా రక రకాల విభాగాల్లో లెక్కకు మించి అవినీతికి పాల్పడ్డారనీ ఇవన్నీ బయట పెడుతున్నారన్న దుగ్ధతో విశాఖపట్నంలో అదనుచూసి నాదెండ్ల మనోహర్ గారిని ధర్నా నెపంతో అరెస్టు చేసారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత కనికట్టు ప్రదర్శించినా ప్రజలు ఇక నమ్మరనీ, ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని బతిమాలి అధికారం చేజిక్కించుకుని ప్రజలని నిలువునా ముంచేసాడనుకుంటున్నారన్నారు. అసలు అభివృద్ధి చేసారనా, కొత్త కొత్త కంపెనీలు రాష్ట్రానికి తెచ్చారనా ఏంచేసారని ఈ వై.సి.పి కి తిరిగి అధికారం ఇమ్మని అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మనోహర్లాల్ గుప్తా, నగేష్, దుర్గా, కోడి శీను, కళ్యాణ్, సతీష్ కుమార్, రాము, సాయి, శివ, మోనకుమారి, బండి సుజాత, రమణమ్మ, లక్ష్మి, మరియమ్మా, గంగ తదితరులు పాల్గొన్నారు.