జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో శుక్రవారం తారీఖున 6వ డివిజన్ అనసూయమ్మ గారి కాలనీలో డాక్టర్ బాబు ఆధ్వర్యంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర జరిగినది. ఈ పాంతంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు పర్యటిస్తూ యాత్రని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వం చెపుతున్న అభివృద్ధి, సంక్ష్యేమం అన్నవి కేవలం వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లలో తప్ప బయట కనపడటం లేదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ముస్లింలు, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, పెన్షనర్లు ఇలా ప్రతిఒక్కరు ఈ వై.సి.పి పాలనపై పెదవి విరచడమే తప్ప ఎవరన్నా మద్దతుగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. పాదయాత్రలో అక్కునచేర్చుకుని అన్నా, అక్కా అని పిలుస్తూ మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాది అని చెపితే నిజమే అని అనుకుని నెగ్గించుకున్న పాపానికి ఆఖరుకి పండగనాడు ఇదివరకు పంపిణీ చేసే గోధుమపిండి, నెయ్యి, పంచదార లాంటి సరుకులని కూడా మానేసి తనే సైతాన్ అనిపించుకున్నాడన్నారు. ఇతర రాజకీయ పార్టీలని తిట్టాలన్న శ్రద్దలో పదోశాతం పాలనపై పెడితే ఇంకా మెరుగైన పాలన ఇవ్వచ్చన్న కనీస ఙ్ఞానం ఈ వై.సి.పి పార్టీకి లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్ధికి మద్దతు ఇచ్చి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, షేక్ బషీర్, సయ్యద్ బాజీ,షేక్, బాషా, మదీనా, జుబేదా షాహేదా, కరీమున్నిసా, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.