కొత్తతుంగపాడులో జనంకోసం జనసేన మహాపాదయాత్ర

  • జన నీరాజనాలతో ముందుకు సాగిన పాదయాత్ర
  • జనం చూపు జనసేన వైపు
  • బత్తుల బలరామకృష్ణకి బ్రహ్మరధం పట్టిన గ్రామ ప్రజలు

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా రాజానగరం మండలం కొత్తతుంగపాడు గ్రామంలో పర్యటించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ బత్తుల బలరామకృష్ణ. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని గ్రామంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ముందుగా గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించి అనంతరం అక్కడి నుండి పాదయాత్రను ప్రారంభించారు. గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలన అంతమొందించి ప్రజా పరిపాలన తీసుకురావాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.