సమస్యలపై పోరాటానికి జనసేన ముందంజలో ఉంటుంది

అన్నమయ్య జిల్లా, నందలూరు మండలానికి పూరవైభవం తీసుకొచ్చి మళ్ళి నందలూరులో ట్రైన్స్ ఆగేలా కృషి చేసిన బీజేపీ నాయకులు సత్య కుమార్ మరియు సాయి లోకేష్ లను రాజంపేట జనసేన పార్టీ తరుపున సన్మానించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. రాజంపేటలో ఉన్న అన్ని మండలాల్లో ఉండే ప్రధాన సమస్యల పై పోరాటానికి పార్టీలకి అతీతంగా జనసేన పార్టీ కార్యకర్తలు పోరాడానికి ముందంజలో సిద్ధంగా ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి భారతాల ప్రశాంత్ పోకిరి మళ్ళి, భారతలా బాలజీ, గోపి, కార్తీక్, హరి బాబు, జ్ఞానీ, పి.కార్తీక్, జి.బాలాజీ, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.