పామురులో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

కనిగిరి: జనసేన పార్టీ పామూరు మండలం అధ్యక్షులు దర్శి ఏడుకొండలు ఆధ్వర్యంలో గురువారం పామురు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరకూటి నాగరాజు మరియు ప్రకాశం జిల్లా కార్యదర్శి రహముల్లా హాజరయ్యారు. తదుపరి నాగరాజు మాట్లాడుతూ పామూరు మండలంలో కార్యకర్తలకు జరిగిన సమస్యలు, ఇబ్బందులు తెలుసుకొని ఇకమీదట ఎటువంటి సమస్యలు ఉన్నా అధికార పార్టీ నుంచి ఒత్తిడిలో ఉన్న వాటి పరిష్కార దిశగా తీసుకెళ్తానని మరియు కార్యకర్తలకు అండగా నేనుంటానని భరోసాని కార్యకర్తలు అందరికీ ఇచ్చారు. మరియు జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో అందరి కృషి ఉండాలని ప్రతి ఒక్కరు సైనికులుగా నిలబడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ ట్రస్ట్ ప్రకాశం జిల్లా అడ్మిన్ కొంకాల రామ్మోహన్ మరియు ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, లాయర్ అనిల్ మరియు పామూరు మండలం సీనియర్ నాయకులు గొస్టు సునీల్, సందాని, జనసైనికులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.