దక్షిణ నియోజకవర్గంలో డా. కందుల సుడిగాలి పర్యటన

  • దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు
  • నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేత

వైజాగ్ సౌత్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శనివారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలను నేరుగా కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 34వ వార్డు లక్ష్మీదేవి పేటలో నవ వధువు లావణ్యకు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. సేవే దైవంగా భావించి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా టిడిపి, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిల్లి కుమార్తె లావణ్య తల్లి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు వాసుపల్లి నరేష్, ఉమ్ముడి గురుమూర్తి, బద్రి(సతీష్) ప్రసాద్, హరీష్, ప్రసన్న, జి.గురుమూర్తి, మంగరాజు, వర, కోదండమ్మా, గునుపూరు లక్ష్మి, సీత, బొద్దాల లక్ష్మి, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.