జనసేన గ్రామ స్థాయి సమావేశం

పలమనేరు రూరల్ మండలం, బయ్యప్ప గారి పల్లి పంచాయితీలో ఉన్న జనసేన ముఖ్య నాయకులను రూరల్ మండల అధ్యక్షుడు నాగరాజు మోతుకూరు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో పార్టీని మరియు జనసేన సిద్ధాంతాలను ఏవిధంగా గ్రామ స్థాయికి తీసుకుని వెళ్ళాలి.. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలపై ఏవిధంగా పోరాడాలి మొదలగు విషయాలపై చర్చించడం జరిగింది. అలాగే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు జ్యోతి బోస్, దిలీప్, కిషోర్, సంయుక్త కార్యదర్శి గాంధీ మరియు జయ సూర్యలు పాల్గోన్నారు.