ఇంటింటికీ సన్న బియ్యం అన్నాడు మోసం చేశాడు!

ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 58వ రోజు

58వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి మండలం, మద్దిలేడు పంచాయతీలో శుక్రవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు పూల వర్షంతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ఇంటింటికీ సన్న బియ్యం ఇస్తానని జగన్ మాట ఇచ్చి మోసం చేశాడు అని మహిళలు వాపోయారు, సి. సి. రోడ్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఉపాధ్యక్షుడు కావలి శివకుమార్, నాయకులు చంద్ర, లోకేష్, నితీష్, వినోద్, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, పేట చిరంజీవి, హేమంత్ గౌడ్, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.