శ్రీ శ్రీ శ్రీ గౌరీశంకరుల రథోత్సవంలో పాల్గొన్న బత్తుల

  • అడుగడుగునా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి ఘన స్వాగతం పలికిన శ్రీరంగపట్నం ప్రజానికం..

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ రథోత్సవ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ గౌరీశంకరుల రథోత్సవ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు శ్రీరంగపట్నం ఆడపడుచులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు చీర & తాంబూలం సమర్పించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అమ్మ వారి సారి కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులు అందరికీ బొట్టు పెట్టి 1000 మందికి జాకెట్ ముక్క పెట్టిన బత్తుల.అమ్మ వారి సారి కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులకు నిర్వహించిన డ్రా కార్యక్రమంలో టోకెన్ గెలిచిన విజేతకు 4 గ్రాముల బంగారం బహుమతిగా అందజేసిన బత్తుల. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.