సమస్యల పరిష్కారం దిశగా జనసేన-టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుంది

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం గొరపాడ, చినబగ్గ, మర్రిపాడు, పెదబగ్గ, పూతికవలస, గ్రామాల్లో గిరిజన నేత సీనియర్ రాజకీయ నాయుకులు ఎక్స్ జడ్పిటిసి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ పర్యటించారు. ఈ సందర్బంగా నిబ్రమ్ మాట్లాడుతూ ఆయా గ్రామల సమస్యలు తెలుసుకొని పరిష్కారం ఖచ్చితంగా పరిష్కారం దిశగా జనసేన-టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుంది అని కచ్చితంగా 2024లో రాబోయే ఎలక్షన్స్ లో మన పాలకొండ నియోజకవర్గంలో ఏ వ్యక్తికి ఏ పార్టీకి టికెట్ వచ్చినా గెలిపించడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతంపేట మండల నాయకులు సవర సింహాద్రి రాజేష్ గణేష్ పాల్గొన్నారు.