మొక్కలు పంపిణి చేసిన జి మాడుగుల జనసేన

జి మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామానికి చెందిన జనసైనికులు త్రిమూర్తులు, కృష్ణమూర్తి, సోమేశ్ కుమార్, పచ్చదనం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశంతో నుర్మతి జి.టి.దబ్ల్యు.ఎ స్కూల్ కి వెళ్లి మొక్కలు పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు హాస్టల్ హెచ్.ఎం మేడం రూపవతి తోటి ఉపాధ్యాయులు జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.