బొందిమడగల గ్రామంలో బాబు, పవన్ షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

పత్తికొండ: బొందిమడగల గ్రామంలో ఆదివారం బాబు పవన్ షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ కె ఈ శ్యామ్ కుమార్ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ తుగ్గలి మండలం బొందిమడగల జనసేన నాయకులు స్థానిక తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో బొందిమడగల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇంటింటికి నీటి కుళాయి తల్లి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15000 రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ఇంటింటికి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, రామచంద్ర, వెంకటేష్, సునీల్, సురేంద్ర రాజశేఖర్, మనోహర్ ఆజాద్ సంజీవ రాయుడు మల్లికార్జున శ్, రాజు, బాలరాజు, రియాజ్, ప్రసాద్, రాజు, రజనీకాంత్, ఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.