అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలి: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దృఢమైన భారత నిర్మాణానికి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క బోధనలను ఆశయాలను వారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలి. కుల మత రహిత ఆధునికత భారతావని కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా మన దేశ పౌరులు ప్రజాస్వామ్య విలువలతో జీవిస్తున్నారంటే అది ఆయన జాతికి అందజేసిన ప్రగతి శీల సంఘటిత రాజ్యాంగం వలననే అనికొనియాడారు. ఆయన ఎన్నో వివక్షలకు గురైనప్పటికీ భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఆలోచనలను మనం అందరం కూడా జనసేన పార్టీ నుండి ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అని అన్నారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ ఆర్య అధినేత జనసేన నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు శిరిపల్లి ప్రసాద్, చేనేత రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, రాచప్రోలు వాసు, వల్లూరు రమేష్, జంగం కృపానందం, భూపతి, ప్రసాద్, బాబీ, కొనికి మహేష్, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు.