బూడిదే సుమన్ కు నివాళులర్పించిన కిల్లో రాజన్

పాడేరు, పెదబయలు మండలం బోంగరం పంచాయతీ వంచుర్భ గ్రామానికి చెందిన బూడిదే సుమన్ అనే గిరిజన స్టూడెంట్ యూనియన్ నాయకులు, బాల్యంలోనే అమ్మను కోల్పోయి అన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికి తన బాధను దిగమింగుకొని చెరగని చిరునవ్వుతో ప్రజల కష్టమే తన కష్టంగా భావించి హక్కుల కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం అహర్నిశలు, అలుపెరుగని పోరాట యోధుడు దూరమవ్వడం గిరిజన జాతికే తీరనిలోటు. విషయం తెలుసుకొని హుటాహుటిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా జాయింట్ కార్యదర్శి కిల్లో రాజన్(ఎల్.ఎల్.బి) పెదబయలు మండలం బోంగరం పంచాయతీ వంచుర్భ గ్రామానికి వెళ్లి అంతిమ యాత్రలో పాల్గొని పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.